
ఇటీవల జరిగిన కొన్ని అంశాల ఆధారంగా సోషల్ మీడియాపై తీవ్ర స్థాయిలోనే పోలీసులు దృష్టి సారించినట్లు తెలిసింది. ‘సోషల్ మీడియాలో పోస్టింగ్స్, రీ పోస్టింగ్స్ చేసేముందు జాగ్రత్త. వ్యక్తిత్వ హననం, ఇతరుల్ని కించపరిచేలా పోస్టులు చేస్తే చర్యలు తప్పవు. శ్రుతిమించిన చేష్టలపై నిఘా ఉంటుందని గ్రహించండి. సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు పరిణామాలను ఆలోచించండి’ అంటూ తెలంగాణ పోలీస్ ట్వీట్ చేసింది.