
ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ మద్దూరు ప్రతినిధి ఏప్రిల్(19).
మండలం లోని లింగపూర్ గ్రామంలో గ్రామాఖ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రం ను దూల్మిట్ట తహసీల్దార్ మధుసూదన్ ప్రారంభించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో వడ్లు అమ్ముకొని మద్దతు పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఎం బాబూరావు,గ్రామ మాజీ సర్పంచ్ ముక్క కనకయ్య,సీసీ సిద్ది మల్లయ్య,సీఏ వినోద,రైతులు గ్రామస్థులు పాల్గొన్నారు.