టీపీసీసీ అధ్యక్షుడు తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నాడు / మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

భారతదేశంలోనే దక్కన్ పీఠభూమి ప్రజలు, అందులో తెలంగాణ ప్రజలే అందరికంటే ముందు తమ నైపుణ్యంతో వ్యవసాయం అభివృద్ధి చేశారు
దానికి పునాదులు వేసింది విష్ణు కుండినులు, శాతవాహనులు, ప్రధానంగా కాకతీయ రెడ్డి రాజులు, ఆ తర్వాత అసఫ్ జాహీ పాలకులు.. తెలియకుంటే తెలుసుకొని మాట్లాడాలి
వెయ్యేళ్ల క్రితమే ఈ తెలంగాణ నేలలో వరి పండిన ప్రాంతాలు ఉన్నాయి.. ప్రపంచానికి వాటర్ షెడ్ మేనేజ్మెంట్ నేర్పించింది తెలంగాణ
ప్రపంచపు భారీ నీటిపారుదల తొలి ప్రాజెక్టు కట్టింది తెలంగాణలో నిజాం సాగర్.. ఇక్కడ ఉన్న వనరులు చూసి బతకడానికి అనేకమంది వలస వచ్చారు
జొన్నకలి జొన్నంబలి
జొన్నన్నము జొన్న పిసరు జొన్నలె తప్పన్
సన్నన్నము సున్న సుమీ
పన్నుగ పలనాటి సీమ ప్రజలందరకున్.. అని శతాబ్దాల కిందటే శ్రీనాథుడు తన రచనల్లో వర్ణించారు
అది మరచి ఎవరి సంతృప్తి కోసమో, ఏ రోటి దగ్గర ఆ పాట పాడే మీ అవకాశవాద రాజకీయాలను తెలంగాణ అస్తిత్వ పతాకకు రుద్ద వద్దు
తెలంగాణ అస్థిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన పీసీసీ అధ్యక్షుడు భేషరతుగా తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం – బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి