
‘భారత్ నెట్’ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో 30 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలకు 2025 చివరి నాటికి రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు రాష్ట్ర ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ కసరత్తు చేస్తోంది.12,751 గ్రామ పంచాయతీలను ఆప్టిక్ ఫైబర్ కేబుల్ తో అనుసంధానం చేయనుంది. ఈ మేరకు T-ఫైబర్ పనులను త్వరగా పూర్తిచేసి, 2028 నాటికి రూ.500 కోట్ల ఆదాయం పొందాలని ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ భావిస్తోంది.