- మాజీ జెడ్పిటిసి రామసహాయం,శ్రీనివాస్ రెడ్డి

తాడ్వాయి ములుగు జిల్లా జూన్ 24(ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
కాంగ్రెస్ పార్టీ రైతు సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటు అని మాజీ జెడ్పిటిసి రామసహాయం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.తాడ్వాయి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రామ సహాయం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ
రైతుల పేరిట సంబరాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి 18 నెలలు రైతులకు ఏం చేశారో చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.
నాలుగు విడతల రైతు భరోసా ఏగోట్టినందుకు రైతు సంబరాలా చేసుకోవడం సిగ్గుచేటు అని అన్నారు.
మేనిఫెస్టోలో అన్ని పంటలకు బోనస్ అని చెప్పి చివరికి సన్నవడ్లకు ఇచ్చి చేతులు దులుపుకోవడం తోపాటు సన్నా వడ్లకు కూడా బోనస్ మూడు దపాలు ఎగోట్టినందుకు సంబరాలు చేసుకోవడం రైతులను మోసం చేయడం కదా అని ప్రశ్నించారు.రైతు భరోసా పేరు మీద ఎకరానికి రూపాయలు 15000 ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పి మాట మార్చి మళ్లీ రూపాయలు 12000 ఇస్తానని చెప్పి చివరికి అవి కూడా రైతులకు పూర్తిస్థాయిలో ఇవ్వనందుకు సంబరలా చేసుకోవడం రైతులు సిగ్గు పడుతున్నారని అన్నారు.రైతు కూలీలకు ఇస్తానన్న రూపాయలు 12 వేల ఏగోట్టినందుకు సంబరాలా ఖమ్మంలో రంగారెడ్డిలో గద్వాల జిల్లాల రైతులకు బేడీలు వేసినందుకు సంబరాలు,కెసిఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధును దేశములో అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నయి, దేశమే ఆదర్శంగా తీసుకొని ప్రధానమంత్రి కిసాన్ పేరు మీద దేశవ్యాప్తంగా ఇస్తున్నారని తెలిపారు .
ఇతర రాష్ట్రాలు రైతుబంధును వివిధ పేర్లతో వారి రాష్ట్రాల్లో ఇస్తున్న నిజం కదా అని అన్నారు రైతులను అన్ని రకాల మోసం చేసినందుకు గాను కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటు ఆయన అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జాజ చంద్రం,మాజీ మండల అధ్యక్షుడు నుశెట్టి రమేష్, మండల మహిళా అధ్యక్షురాలు సోమ నాగమ్మ, తుమ్మల రాజేందర్,కొర్నిబెళ్లి శేషగిరి,కొత్తూరు రోహిత్, గడదాసు దేవయ్య,బాబు, దుర్గం నవీన్,దుర్గం రవి, రామసహాయం దిలీప్ తదితరులు పాల్గొన్నారు