- ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్

ములుగు జిల్లా జూన్ 24(ది టైమ్స్ అఫ్ తెలంగాణ)
రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతు భరోసా పథకం కింద నిధులు మంజూరు చేయడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి మంత్రి సీతక్క కి,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ జిల్లా నాయకులు పైడాకుల అశోక్ మాట్లాడుతూరాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేసి, ఇప్పటి వరకు 1 కోటి 49 లక్షల 39 వేల రూపాయలు 111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది.సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఏఐసీసీ అధ్యక్షులు మల్లి కార్జున్ ఖర్గే కి,సోనియాగాంధీ గాంధీ కి,రాహుల్ గాంధీ కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కి, మంత్రి సీతక్కకి,మంత్రి వర్గానికి అందరికి ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం చేయడం జరిగింది.గతంలో ఎకరాకు పది వేల రూపాయలు ఇవ్వగా ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఎకరాకు 12 వేల చొప్పున అన్ని వ్యవసాయ భూములకు అందించాము16వ తేదీన నుండి నిధుల విడుదల ప్రారంభించడం జరుగుతుందని రేపటికి 100 శాతం వ్యవసాయ భూములకు భరోసా నిధుల విడుదల పూర్తి అవుతుంది తెలియచేశారు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే కచ్చితంగా అమలు చేస్తుందని అన్నారు.
కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు,యూత్ నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు, మహిళ నాయకులురైతులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు