- జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

ములుగు జిల్లా జూన్ 24(ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
జిల్లా ప్రజలు ప్రత్యేక బస్సు టూర్ ప్యాకేజీని వినియోగిం చుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు.మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో ప్రత్యేక టూర్ ప్యాకేజీ పోస్టర్,ప్రచార కరపత్రాలను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆవిష్కరించారు.రూట్-1లోరామప్ప- భోగతా జలపాతం-మల్లూరు ఎక్సప్రెస్ బస్సు ద్వారా సందర్శనకు ఒక్కొక్కరికి 530/- ఒక్కరోజుకు,రూట్-2 ద్వారా పంచారామాలు ప్రసిద్ధ 5 శివాక్షేత్రలైన అమరావతి, బీమవరం,పాలకొల్లు, ద్రాక్షారామం,సామర్లకోట సందర్శనకు ఒక్కొక్కరికి 2300/- రెండు రోజులు భక్తులు సౌకర్యాన్ని వినియోగించు కోవాలని,
హనుమకొండ బస్సు స్టాండ్ నుండి ఈ నెల 27 న పంచారామాలు యాత్ర బస్సు బయలుదేరుతుందని అన్నారు.కార్యక్రమంలో వరంగల్-2 డిపో మేనేజర్ జ్యోత్స్న,కలెక్టరేట్ పరిపాలనా అధికారి రాజ్ కుమార్,జిల్లా అధికార,తదితరులు పాల్గొన్నారు.