
ములుగు జిల్లా ఏప్రిల్19( ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
జిల్లాలో రెండు రోజులు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణం శాఖ సూచన ప్రకారము రైతులు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాతావరణ శాఖ సూచన ప్రకారం ములుగు జిల్లాలో ఈరోజు రేపు అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నదని
జిల్లాలో ఉన్న సమస్త రైతులకు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు తెలియజేయునది ఏమముగా నేడు, రేపు మరియు ఎల్లుండి జిల్లాలో అందరు అప్రమత్తంగా ఉండి ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవరుతో కప్పి ఉంచి ధాన్యం రాశి చుట్టూ గాతు తీసి ఉంచి అందరు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.