
ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ మద్దూరు ప్రతినిధి ఏప్రిల్(19).
మద్దూరు మండలం లోని లద్నూర్ గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన ప్రథమ వార్షికోత్సవాన్ని కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలు బోనాలతో బొడ్రాయి నాభిశిల ప్రాంగణానికి తరలివచ్చి బోనాలను సమర్పించి వారి మొక్కులను తీర్చుకున్నారు. వేద పండితులు మంత్రోచరణాల మధ్య గణపతి పూజ,దుర్గాదేవి,రుద్ర యజ్ఞాలు జరిపి పూర్ణహుతి నిర్వహించారు.కుంభాభిషేకం,మహదశీర్వచనం,చేశారు.భక్తులు పంచ బోనాలు సమర్పించారు.సంప్రదాయం ప్రకారం బైండ్ల శాలివాహన రజక విశ్వబ్రాహ్మణ,కుల సంఘాలు బాద్యులు శితలమాత పట్నం పూజాలు,జంతు బలి పూజలు నిర్వహించారు. నాభిశిల బొడ్రాయికి ప్రథమ వార్షికోత్సవ పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలంతా భక్తిశ్రద్ధలతో పాల్గొని ప్రత్యేకంగా అభిషేకాలు, కుంకుమార్చన విశేష పూజలు నిర్వహించారు.నాభి శిల బొడ్రాయిని దర్శించుకున్న ప్రజలు మా గ్రామాన్ని చల్లంగా చూడు తల్లి అంటూ తమ మొక్కలు తీర్చుకుంటూ, వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని నైవేద్యం సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నాభిశిల బొడ్రాయి ప్రాంగణానికి గ్రామంలోని పెద్దలు, మహిళలు, యువతి, యువకులు, భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. సకల దేవతల ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని గ్రామ పెద్దలు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామస్థులు,బొడ్రాయి కమిటీ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.