
నిజాంపేట్ (ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ ):
జమిలి (ఒకే దేశం ఒకే ఎన్నిక) ఎన్నికల ఆవశ్యకత గురించి శనివారం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్ శ్రీ కృష్ణా గార్డెన్ లో అవగాహన సదస్సు కు మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ముఖ్య అతిధి గా విచ్చేసి ప్రసంగించారు.
ఈటల రాజేందర్ మాట్లాడుతూ*’పాలనలో నిరంతరాయత్వాన్ని ప్రోత్సహించడం, విధాన నిర్ణయాల్లో జాప్యాలను నివారించడం, వనరులను వేరువేరు చోట్ల ఉపయోగించాల్సిన అవసరం తగ్గించడం, ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యతను పరిరక్షించడం, రాజకీయ అవకాశాలు పెంపొందించడం, పరిపాలనపై దృష్టిని కేంద్రీకరించడం, ఆర్థిక భారం తగ్గడం’వంటి దేశ ప్రయోజనాలపై కాకుండా
వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది దేశంలో ఎన్నికల ఖర్చులను తగ్గించాలని లక్ష్యంతో దేశంలోని అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని ఉద్దేశంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ ను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం దానికి దాదాపు 269 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేయడం జరిగిందని దేశంలో 1952, 57, 62, 67 సంవత్సరాల్లో నాలుగు సార్లు పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని, జమిలి ఎన్నికలు మనకు కొత్తకాదు’ అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
ఈజమిలి ఎన్నికల విధానం ప్రపంచ దేశాలైన స్వీడన్ ,జర్మనీ వంటి దేశాలలో జెమిని ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని వన్నెషన్ వన్ ఎలక్షన్ నిర్వహించడం వలన లక్షల కోట్ల ప్రజాధనం వృధా కాకుండా కాపాడడమే కాకుండా ప్రజల మరియు అధికారుల సమయ భారాన్ని కూడా తగ్గించవచ్చని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ఈ అంశం పైన వారు ప్రసంగించడం జరిగింది
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొల్లి మాధవి, జయశ్రీ జిల్లా కార్యదర్శులు గిరివర్ధన్ రెడ్డి విగ్నేశ్వర చారి స్థానిక బిజెపి అధ్యక్షులు నరేంద్ర చౌదరి, ప్రసాద్ రాజు, బిక్షపతి యాదవ్, నిజాంపేట కార్పొరేషన్ బిజెపి నాయకులు విజయలక్ష్మి సుబ్బారావు, సుమన్ రావు, డాక్టర్ రాజు, చక్రధర్, సుబ్బారావు, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ లోని వివిధ వృత్తులకు సంబంధించిన మేధావులు, వివిధ అసోసియేషన్ ప్రెసిడెంట్లు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
