
గత వారం కంటి సమస్య కారణంగా ఇద్దరు కొడుకులని కత్తితో తల్లి నరికి చంపిన ఘటన మరువకముందే మరో విషాదం
నాలుగేళ్ల కూతురుకి కూల్ డ్రింక్లో ఎలుకల మందు తాగించి.. తాను కూడా తాగిన తల్లి
చిన్నారి మృతి.. ప్రాణాపాయం నుండి బైటపడ్డ తల్లి
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, హరితా ఆర్కేడ్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న దంపతులు నంబూరి సాంబశివరావు, పావని
వీరికి ఏకైక సంతానం నాలుగేళ్ల కూతురు జెశ్విక ఉంది.. అయితే కొన్నేళ్లుగా నరాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న తల్లి పావని కూల్ డ్రింక్లో ఎలుకల మందు కలుపుకొని తాగి కూతురు జెశ్వికకు కూడా తాగించింది
సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగిగా పనిచేస్తున్న సాంబశివరావుకు విషయం తెలియకపోవడంతో రోజు మాదిరిగానే భోజనం నిద్రపోయారు
ఆరోజు రాత్రి ఇద్దరూ పలుమార్లు వాంతులు చేసుకోగా.. మరుసటి రోజు ఉదయం కూడా వాంతులు అవుతుండటంతో భర్తకు అసలు విషయం చెప్పిన పావని.. దీంతో వెంటనే వారిని కూకట్పల్లిలోని ఓ ఆస్పత్రికి తీసుకు వెళ్లిన సాంబశివరావు
జెశ్విక పరిస్థితి విషమించడంతో రెయిన్బో ఆస్పత్రికి తరలింపు.. అయితే పరిస్థితి మరింత విషమించడంతో మృతి చెందిన జెశ్వి