తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజాద్ పాషా

ములుగు జిల్లా జూన్ 23 (ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
ములుగు మండలంలోని జంగాలపల్లి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా రెండు లక్షల లోపు రుణాలన్నింటిని మాఫీ చేయాలని,పంట రుణాలు అన్నింటిని రెన్యువల్ చేయాలని,పహాని నకల్ ద్వారా తీసుకున్న రుణాలు అన్నింటిని మాఫీ చేయాలని, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది.ఎండి అంజాద్ పాషా మాట్లాడుతూ ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతం యూనియన్ బ్యాంకు పరిధిలోని సుమారు 25 గ్రామాలు ఏజెన్సీ గ్రామాలు నీటి వసతి లేక పంటలు దిగుబడి రాక రైతులు అప్పుల పాలు అవుతున్నారు అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా రెండు లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని,పంట రుణాలను ఈ సంవత్సరం రెన్యువల్ చేయాలని ములుగు జిల్లాలో కేవలం 30 శాతం మంది రైతులకు మాత్రమే పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయని, పాణి నకల్ ద్వారా తీసుకున్న రుణాలు కూడా మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు.బ్యాంకుల పరిధిలో రైతులకు 60 శాతం మంది రైతులకు మాత్రమే రుణాలు మాఫీ అయినాయని గ్రామపంచాయతీ ఎన్నికల ముందు రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేయాలని లేనిచో రైతులు ఎన్నికల్లో బుద్ధి చెప్తారని ప్రభుత్వాలను హెచ్చరించారు.ధర్నా అనంతరం యూనియన్ బ్యాంక్ జంగాలపల్లి మేనేజర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకులు మంకిడి కృష్ణయ్య,ఆర్ బిక్షపతి, ఆవుల ఐలయ్య,ఎండి అబ్దుల్ నబీ,తోట శాంతమ్మ, మహారాజు నారాయణ,లక్ష్మి, రైతులు పాల్గొన్నారు.