- బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్

ఏటూరునాగారం ములుగు జిల్లా జూన్ 23(ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో ఎటురునాగారం ఐటిడిఏ లో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు గండేపల్లి సత్యం ఆధ్వర్యంలో ఐటీడీఏ పీవో కి ఆదివాసి గిరిజనుల సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కార్యక్రమాన్ని కి ముఖ్య అతిథిగా హాజరైన భారతీయ జనతా పార్టీ ఎస్టి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్ మాట్లాడుతూ ఐటిడిఏ లకు 80 శాతం నిధులు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గిరిజనులకు గిరిజన సమస్యలపై అభివృద్ధి ధ్యేయంగా తోడ్పడడానికి రాష్ట్రానికి నిధులు కేటాయిస్తే గిరిజనులకు అందనంత దూరంలో నిధులు ఉన్నాయి అని అన్నారు.వేలకోట్లకు పైగా బిజెపి ప్రభుత్వం ఐటీడీఏలకు నిధులు ఇస్తున్నాయని అన్నారు.కానీ ఆ యొక్క నిధులను ఐటిడిఏ అధికారులు గిరిజన ఆదివాసులకు అందడంలో విఫలం అవుతున్నాయి కేంద్రం ఇచ్చే పథకాలకు ఏజెన్సీ ప్రాంతాలలో కూడా కేంద్ర పథకాలు అమలు చేయలేకపోతున్నారని అన్నారు.ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన,సుకన్య సమృద్ధి యోజన,డొమశీల పత్రం,ముద్ర యోజన,కిసాన్ క్రెడిట్ కార్డులు ఇటువంటి 22 పథకాలకు పైగా గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న బిజెపి ప్రభుత్వం వాటిని అమలు పరచడంలో అధికారులు విఫల మవుతున్నారని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న ఆదివాసి గిరిజనులకు పెస గ్రామసభల ద్వారా పథకాలను వివరించి ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా అధికారులు పని చేయాలని కోరారు.ఏ పథకం ద్వారా గిరిజన ఆదివాసులకు లబ్ధి జరుగుతున్న ఆ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు ఐటిడిఏ కార్యాలయం నుండి ప్రతి ఒక్క అధికారి బయటకు వెళ్లి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు.ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులకు సంబంధించిన గ్రాండ్స్ ఆదివాసి గిరిజన గుడాలలో మాత్రమే ఖర్చులు చేయాలని డిమాండ్ చేశారు.విద్య వైద్యం ప్రతి ఒక్క ఆదివాసి గిరిజనులకు అందే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలి అని కోరారు. కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు వినుకోలు చక్రవర్తి, గిరిజన మోర్చా జిల్లా నాయకులుమైపతి సంతోష్, వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు