- పస్రా సీఐ జి.రవీందర్

గోవిందరావుపేట ములుగు జిల్లా జూన్ 23(ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
గోవిందరావుపేట మండలంలోని పస్రా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన పస్రా సిఐ జి.రవీందర్,ఎస్సై ఏ.కమలాకర్,సీఐ మాట్లాడుతూ మాదకద్రవ్యాల దుర్వినియోగం-అక్రమ రవాణా అవగహన వారోత్సవాల సందర్భంగా డ్రగ్-రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రజలు, యువత/విద్యార్థులు కలిసి కట్టుగా ముందడుగు వేయాలనివిద్యార్థిని,విద్యార్థులతో కలిసి జాగ్రత్త! మాదక ద్రవ్యాలు మీ జీవితాన్ని నాశనం చేస్తాయి డ్రగ్స్ కు నో చెప్పండి,యాంటీ నేరోటిక్స్ వారోత్సవాల సందర్భంగా యాంటీ డ్రగ్స్ పోస్టర్లు రిలీజ్ చేశారు.గంజాయి లాంటి మత్తుపదార్థాలకు సంబందించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో నెంబర్ 8712670086 కి లేదా 1906 కి లేదా డయల్ 100 లేదా మీ పరిధిలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుదన్నారు.కార్యక్రమం లో ఉపాధ్యాయులు,పోలీస్ సిబ్బంది,తదితరులను పాల్గొన్నారు