
ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ మద్దూరు జూన్(24).మానేపల్లి ప్రభాకర్..
గౌరవ పాత్రకేయ మిత్రులకు తెలియజేయునది ఏమనగా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు మద్దూరు మండల మోడల్ స్కూల్ మద్దూరు మరియు ధూళిమిట్ట మండలాలకు సంబంధించిన మహిళా సంఘాలకు ఉపాధ్యాయులకు ఉల్లాస్ మరియు టాస్ పైన శిక్షణ కార్యక్రమం నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో దూలిమిట్ట ఎంపీడీవో వీర రాజు మరియు ధూళిమిట్ట ఎంఈఓ శ్రీ ఎం మీనాంజనేయులు మరియు మద్దూరు ఎంఈఓ వరదరాజులు మరియు ఏపీఎం బాబురావు మరియు వివిధ పాఠశాలల గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వివిధ గ్రామాల మహిళా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొని ఈ కార్యక్రమం పై అవగాహన కల్పించబడినది. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ గ్రామాల్లోని చదువు రాని వారిని గుర్తించి ఈ నెల 30 లోగా ఉల్లాస్ యాప్ లో చేర్పించే విధంగాను మరియు చదవడం వచ్చినవారు ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతిలో చేర్పించుటకు మరియు 10వ తరగతి పూర్తి చేసి పై తరగతులు చదవని వారు ఓపెన్ స్కూల్లో ఇంటర్మీడియట్ లో చేర్పించుటకు సూచించనైనది…