
వరంగల్, జూన్ – 24(ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ).
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో రైతు భరోసా సంబరాల్లో భాగంగా మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే కె. ఆర్ నాగరాజు పాలాభిషేకం చేశారు. వర్ధన్నపేట రైతు వేదికలో వానకాలం 2025 రైతు భరోసా సంబరాలు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిచే ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.