
వరంగల్, జూన్ – 24(ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ).
సమస్యలతో సతమతమవుతున్న పేదలకు ఎర్రజెండా పోరాటాలే ఏకైక శరణ్యమని ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. పాలకులు ఎన్నికలలో ఇచ్చిన హామీలను రాజకీయాలకతీతంగా పేదలకు అందించాలని డిమాండ్ చేశారు. మంగళవారం నర్సంపేట పట్టణంలోని కారల్ మార్క్స్ కాలనీ ఎంసిపిఐ(యు) జనరల్ బాడీ సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు గడిచిన పేదల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారిందని అన్నారు.