
హన్మకొండ, జూన్ – 24(ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ).
మత్తు పదార్థాలను నియంత్రించడంలో ప్రతి విద్యార్థి ఒక సైనికుడిగా మారాలని పరకాల సీఐ క్రాంతి కుమార్ తెలిపారు. డ్రగ్స్ వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకొని పరకాల మండలం కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత మత్తు పదార్థాల జోలికి పోవద్దని, వాటితో వారి జీవితం అంధకారం అవుతుందని సీఐ తెలిపారు.