- ములుగు జిల్లా టియూడబ్ల్యూజే (ఐజేయూ)
జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు ఎమ్డీ షఫీ అహ్మద్

తాడ్వాయి ములుగు జిల్లా జూన్ 24(ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఆంధ్రజ్యోతి పాత్రికేయుడి పై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా జర్నలిస్టు యూనియన్ అధ్యక్షులు ఎమ్డీ షఫీ అహ్మద్,కార్యదర్శి వాసుదేవ్ లు తీవ్రంగా ఖండించారు.ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడంలో అవకతవకలు జరుగుతున్నాయని తాడ్వాయి ఆంధ్రజ్యోతి విలేకరి చల్లగొండ శ్రీకాంత్ రెడ్డి ప్రచూరించిన కథనాలకు అధికారంలో ఉన్న పార్టీ తప్పిదాలను సరిచేసుకోవలసి ఉండగా ప్రచూరించిన పాత్రికేయుడి పై భౌతిక దాడులకు పాల్పడడం సబబు కాదని జరిగిన సంఘటనను జర్నలిస్టులంతా ముక్త ఖంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నాము.దాడికి పాల్పడిన నార్లాపూర్ కు చెందిన ఐదుగురు వ్యక్తులు భేషరతుగా క్షమాపన చేప్పాలని,వారి పై పోలీసు శాఖ వారు కేసు నమోదు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం