తెలంగాణలో రూ.10,500 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు NTT డేటా ముందుకు వచ్చింది. టోక్యో పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంఓయూ ఒప్పందం కుదుర్చుకుంది.400 మెగావాట్ల సామర్థ్యం,25,000 CPUలతో లిక్విడ్ ఇమ్మర్షన్ టెక్నాలజీతో ఏఐ సూపర్ కంప్యూటింగ్ ఏర్పాటు చేయనుంది.విద్యాసంస్థలతో భాగస్వామ్యం,తెలంగాణను ఏఐ రాజధానిగా తీర్చిదిద్దే మెగా ప్రాజెక్ట్గా తీర్చిదిద్దనుందని రేవంత్ రెడ్డి అన్నారు.